తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఫస్టియర్లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్, హన్మకొండ రెండవ స్థానంలో నిలిచాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.