ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అతని పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసినా తన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ఇంకా జైలులో ఉంచుతున్నారంటూ సునీల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.అయితే కేసు కీలక దశలో ఉన్న ఈ సమయంలో ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీబీఐ కోర్టును కోరింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకన్నా సాక్షుల భద్రత, కేసులో పురోగతి ముఖ్యమని అభిప్రాయపడుతూ బెయిల్ నిరాకరించింది. ఇక సీబీఐ, వివేకా తనయ సునీతారెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘవాదనలు జరిగాయి.