కేసీఆర్ కుటుంబంపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల. కేసీఆర్ పాలనలో తెలంగాణ అఫ్ఘనిస్తాన్లా తయారైందని… కేసీఆర్ తాలిబన్ చీఫ్ లా, ఆయన వెంట ఉన్న నాయకులు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ ను దోచుకుతిందని… అంతా కక్కిస్తామనీ అన్నారు. తనను తెలంగాణ వ్యక్తినే కాదంటున్నారని..కేటీఆర్ భార్య ఆంధ్రానుంచి వచ్చినవారు కాదా అని ప్రశ్నించారు. తాను తెలంగాణలో పుట్టి పెరిగినదాన్ని అని..ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకుని, ఇక్కడే కొడుకును కన్నాననీ అన్నారు. మొన్నటిదాకా బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వాళ్లు ఇప్పుడు తనను బీజేపీ మనిషంటున్నారని మండిపడ్డారు షర్మిళ.