తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామి వారిని సేవించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం మంచిదని ఆమె అన్నారు.
https://twitter.com/LGov_Puducherry/status/1656193582569754624?s=20