తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య విభేదాలు ఇంకా సద్దుమణగడం లేదు. తాజాగా చీఫ్ సెక్రటరీ తీరుపై తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదిగ్గా శాంతికుమారి తీరును తప్పుబట్టారు. డియర్ సీఎస్ అని సంబోధిస్తూ…ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర ఉందని… సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత రాజ్ భవన్ కే రాలేదనీ అన్నారు. రాజ్ భవన్ సందర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమయమే దొరకడం లేదా అని నిలదీసినట్టు ట్వీట్ చేశారు. కనీసం ఫోన్లో నైనా మాట్లాడలేదని అన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తుపెట్టుకోవాలనీ గవర్నర్ అన్నారు. ముఖ్యమైన బిల్లులు ఆమోదించకుండా అన్నీ తన దగ్గరే పెట్టుకున్నారంటూ గవర్నర్ పై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకు వెళ్లిన సంగతి తెలిసిందే. శాంతికుమారి పిటిషన్ వేయగా… ప్రతివాదిగా గవర్నర్ ను చేర్చారు. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని…ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ కోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం.
https://twitter.com/DrTamilisaiGuv/status/1631532302017892353?s=20
రాజ్ భవన్ కు వచ్చే సమయం కూడా లేదా సీఎస్ గారూ – శాంతికుమారిని నిలదీస్తూ గవర్నర్ ట్వీట్
https://twitter.com/DrTamilisaiGuv/status/1631532302017892353?s=20
Share: