మద్యం ధరలు మళ్లీపెంచింది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కిందట 2020 మే లో మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. మళ్ళీ ఇప్పుడు పెంచింది. అదే విధంగా మద్యం బాటిళ్లపై పాత ఎమ్ఆర్పీలు ఉన్నప్పటికీ.. వాటికి కూడా కొత్త ధరలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
రెండు వందల లోపు ఎమ్ఆర్పీ ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్ పై రూ. 20, 375 ఎంఎల్ పై రూ.40, 750 ఎంఎల్ పై రూ. 80 లెక్కన పెంచినట్లు తెలిపారు. అదే విధంగా 200 కన్నా ఎక్కువ ఎమ్ఆర్పీ ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్ పై రూ. 40, 375 ఎంఎల్ పై రూ. 80, 750 ఎంఎల్ పై రూ. 160 పెంచినట్లు సర్పరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. వైన్ బ్రాండ్ ఎమ్ఆర్పీపై క్వార్టర్ పై రూ. 10, హాఫ్ పై రూ. 20, ఫుల్ పై రూ. 40 లెక్కన పెంచారు. అన్ని రకాల బీర్ బ్రాండ్ల ఎమ్ఆర్పీపై రూ. 10 పెంచినట్లు తెలిపారు.