తెలంగాణ ఆవిర్భావదినోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో పతాకావిష్కరణ చేసారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సారధి బండి సంజయ్ కూడా జాతీయపతాకావిష్కరణ చేశారు.తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అటు సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదిగ్గా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’’ అంటూ తెలుగులో ట్వీట్ చేశారు మోదీ.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2022
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం’’. ‘‘గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో దారుణమైన పాలనను చవిచూసింది. #TelanganaFormationDay నాడు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు & సామాన్య ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
India’s youngest state, Telangana was born out of people's aspirations for a better future.
I feel proud that the Congress party and Sonia Gandhi ji listened to the people’s voice and worked selflessly towards fulfilling the dream of Telangana.#TelanganaFormationDay
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022
సోషల్మీడియాలో కూడా తెలంగాణ యువత సందడి చేస్తోంది. ఉద్యమకాలాన్ని, వీరుల పోరాటాలను, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణకు మద్దతిస్తూ లోక్ సభా పక్షనాయకురాలిగా మద్దతిచ్చిన దివంగత బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ నూ గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్. ప్రత్యేకరాష్ట్రానికి మద్దతిస్తూ యువత ఆత్మహత్య చేసుకోవద్దని తెలంగాణ వచ్చి తీరుతుంది. అది చూసేందుకు బతికి ఉండాలి అంటూ ఆమె తెలుగులో చేసిన ప్రసంగాన్ని జతచేస్తూ… తెలంగాణ చిన్నమ్మకు నివాళులు అంటూ షేర్ చేస్తున్నారు.