ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో తాను జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టానని…అయితే రేపు విచారణకు రావల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు.అయితే ఈడీ నోటీసులు పంపిస్తే తెలంగాణ మొత్తానికేం సంబంధం అని, మీరు తప్పు చేసి తెలంగాణ పేరు ఎందుకు వాడుకుంటున్నానని..ఇంకెంతకాలం సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు. అదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసిఆమెను విచారించే అవకాశం ఉందంటున్నారు. కవితకు బినామీనని పిళ్లై అంగీకరించాలని ఈడీ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.