హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గురువారం పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పార్టీ కార్యకర్తలు స్కూటర్ను తగులబెట్టి.. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రేణుకా చౌదరి సబ్ ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకున్నారు.
https://twitter.com/tweet_aneri/status/1537343335035117568?s=20&t=M2GR3Knj6ac7dkQgoDiVrw
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, శ్రీధర్బాబు సహా కొందరు ఆందోళనకారులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
https://twitter.com/krishanKTRS/status/1537349587240775682?s=20&t=vCYShduv_Jlfoz4njFwVKg
నిరసనల సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు, పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. రేణుకా చౌదరి శాంతిని కోల్పోయి పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుంది. పోలీసు అధికారి రేణుకపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుండా సంయమనం పాటించడంగమనార్హం. అయితే మరికొందరు కాంగ్రెస్ కార్యకర్త రేణుకను శాంతింపజేసేందుకు.. ఆమె చేతిని పోలీసు కాలర్ పై నుంచి తొలగించడానికి ప్రయత్నించారు.
https://twitter.com/jsuryareddy/status/1537339993491853313?s=20&t=XuOelGzlZOAsBGgu31tlmQ
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినందుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ‘చలో రాజ్ భవన్’ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. తెలంగాణలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నిరసన తెలిపింది.