సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. రైతు నేతలను, ధాన్యం కొనుగోలు వివాదం విషయమై కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశమున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం ఫ్యామిలీ అంతా కలిసి శ్రీరంగం వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.. రేపు ఢిల్లీ నుంచి కేసీఆర్ శ్రీ రంగం వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే టూర్ లో ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించుకోనున్నారని.. పంటి నొప్పి తీవ్రం కావడంతోనే ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. ఇది వరకు పంటి నొప్పి కోసం ఢిల్లీలోనే సీఎం ట్రీట్మెంట్ తీసుకున్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానన్న వ్యక్తి పంటి నొప్పి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లడమేంటని.. మన రాష్ట్రంలో అలాంటి సౌకర్యాలు కల్పించడంలో సీఎం విఫలమయ్యారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.