తెలంగాణ రాష్ట్రం లో సంక్షేమం మరియు అభివృద్ధి కోసం భారీ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక అవసరాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయి కసరత్తు తర్వాత ఇప్పుడు పూర్తి బడ్జెట్ను శాసనసభకు సమర్పించారు. స్వయంగా ఆర్థిక మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేశారు.
బడ్జెట్ లోని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రభు త్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్స లకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతానికి పెంచారు. అంతేకాదు ఇందులో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్ట నున్నట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే ఈఎన్టీ ఆసుపత్రిని అందుబాటు లోకి తెస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్ లో రూ.11,468 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లు ఇస్తున్నారు .మూసీ నది నీటిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న తర్వాత యూకే ప్రభుత్వం తో ఈ విషయమై చర్చలు జరిపారు. హైద్రాబాద్ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులను యూకేకు తీసుకెళ్లి ప్రభు త్వం ఈ విషయమై చర్చించింది. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కు ప్రభుత్వం రూ. 1500 కోట్లు కేటాయించింది. హైద్రాబాద్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,525 కోట్లు కేటాయి స్తు న్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూ. 50 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.
జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ. 3,065 కోట్లు ఇస్తున్నారు . జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.3 ,065 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏలో కూడా మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లను కేటాయిం చినట్టుగా ప్రభుత్వం తెలిపింది. మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ. 200 కోట్లను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. హైద్రాబాద్ నగర అభివృ ద్దికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. విమా నాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు కేటాయించినట్టుగా ప్రభు త్వం వెల్లడించింది.
రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723 కోట్లు ఇస్తున్నారు . ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తు న్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.723 కోట్లను కేటాయించింది. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 2,418 కోట్లను కేటాయించింది.
బడ్జెట్లో అనేక అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.
తెలంగాణ బడ్జెట్ విలువ 2లక్షల 91 వేల 159 కోట్లు అని లెక్క తేల్చింది. మూలధన వ్యయం రూ.33 వేల 487 కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ వ్యయం రూ .2,20,945 కోట్లుగా ఉందని భట్టి తెలిపారు.రాష్ట్ర అప్పు లు రూ.6.70 లక్షల కోట్లకు పెరిగాయని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అప్పు లు రూ.35,118 కోట్లని ఆయన వివరించారు. బీఆర్ఎస్ సర్కా్ర్ చేసిన అప్పులకు వడ్డీలతో కలిపి రూ. 42,892 కోట్లను చెల్లించామన్నారు.
ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుండగా ఇందులో పస లేదని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.