టెర్రరిస్టుల షెల్టర్ జోన్ గా హైదరాబాద్ మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అధికారం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు దగ్గరగా మెసులుతూ ఉంటాయని విమర్శించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమనీ అన్నారు. నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలపై ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష జరపడం లేదని ప్రశ్నించారు.
టెర్రరిస్టులకు షెల్టర్ జోన్ గా తెలంగాణ – సీఎం ఎందుకు స్పందించడం లేదు- బండిసంజయ్
Share: