ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలకానుంది. తెలంగాణలోని మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లా పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానానికి, ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను దాదాపు ఖరారం చేశాయి.
ఇక ఏపీలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. కృష్ణా-గుంటూరు-తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16 నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఎన్నికల ప్రక్రియ ముఖ్య తేదీలు…
నామినేషన్ల స్వీకరణ-ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన-ఫిబ్రవరి 24
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ-ఫిబ్రవరి 26
పోలింగ్ మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు
ఓట్ల లెక్కింపు-మార్చి 17