“డీఎంకే”పై సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ సూర్య
బీజేపీ యువమోర్చా చీఫ్.. ఎంపీ తేజస్వీ సూర్య డీఎంకే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ అనేది పూర్తి హిందూ వ్యతిరేక పార్టీ అని.. దీనిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటూ తమిళ ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ ప్రచారం చేపడుతోంది. ఎలాగైనా ఈ సారి తమిళనాడులో కమలం వికసించేలా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తేజస్వీ సూర్య తమిళనాడులో పలు కార్యక్రమాలకు హాజరవుతూ.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన తేజస్వీ డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంకే స్టాలిన్ను ఓడించాలన్నారు.
బీజేపీ మాత్రమే దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను సమానంగా గౌరవిస్తూ.. ప్రోత్సహిస్తుందన్నారు. ఈ క్రమంలోనే డీఎంకే పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అన్నారు. దేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న పవిత్ర భూమి తమిళనాడు అని.. ఇక్కడ ఉన్న తమిళులు గర్వించదగ్గ హిందువులన్నారు. ఇక రాష్ట్ర సదస్సులో ప్రసంగించిన తేజస్వీ.. తమిళనాడు ప్రతి అంగుళం పవిత్రమైందని.. దీనిని పవిత్రంగా ఇలానే ఉంచాలంటే హిందూ వ్యతిరేక పార్టీ డీఎంకేను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
“డీఎంకే”పై సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ సూర్య
“డీఎంకే”పై సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ సూర్య
బీజేపీ యువమోర్చా చీఫ్.. ఎంపీ తేజస్వీ సూర్య డీఎంకే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ అనేది పూర్తి హిందూ వ్యతిరేక పార్టీ అని.. దీనిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటూ తమిళ ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ ప్రచారం చేపడుతోంది. ఎలాగైనా ఈ సారి తమిళనాడులో కమలం వికసించేలా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తేజస్వీ సూర్య తమిళనాడులో పలు కార్యక్రమాలకు హాజరవుతూ.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన తేజస్వీ డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంకే స్టాలిన్ను ఓడించాలన్నారు.
బీజేపీ మాత్రమే దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను సమానంగా గౌరవిస్తూ.. ప్రోత్సహిస్తుందన్నారు. ఈ క్రమంలోనే డీఎంకే పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అన్నారు. దేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న పవిత్ర భూమి తమిళనాడు అని.. ఇక్కడ ఉన్న తమిళులు గర్వించదగ్గ హిందువులన్నారు. ఇక రాష్ట్ర సదస్సులో ప్రసంగించిన తేజస్వీ.. తమిళనాడు ప్రతి అంగుళం పవిత్రమైందని.. దీనిని పవిత్రంగా ఇలానే ఉంచాలంటే హిందూ వ్యతిరేక పార్టీ డీఎంకేను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
Share: