సొంత యూట్యూబ్ చానల్ “క్యూ న్యూస్” ద్వారా కేసీఆర్ తీరును ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. డిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ మల్లన్నకు పార్టీ సభ్యత్వం ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం పార్టీ చీఫ్ బండిసంజయ్, ఎంపీ అరవింద్ తో కలిసి …మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులను, మీడియాను కేసీఆర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి చిట్టాను బయటకు తీసి మై హోమ్ సిమెంట్ తోనే ఆయనకు రాజకీయ సమాధి కడతానని మల్లన్న అన్నారు.