]2024 పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జులను నియమించింది. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు పార్టీ చీఫ్ నడ్డా అధికారిక ప్రకటన విడుదల చేశారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి పంజాబ్, చంఢీగఢ్ బాధ్యతలు, త్రిపుర మాజీ సీఎం విప్లవ్ దేవ్ కు హర్యానా బాధ్యతలు, కేంద్రమాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ కు కేరళ బాధ్యతలు అప్పగించింది పార్టీ. మహేశ్ శర్మను త్రిపుర పంపాలని నిర్ణయించారు. హర్యానా ఇన్ చార్జ్ గా ఉన్న వినోద్ తావ్ డేను బిహార్ ఇన్చార్జిగా నియమించారు నడ్డా. ఇక మధ్యప్రదేశ్ కు మురళీధర్ రావు, తెలంగాణకు తరుణ్ చుగ్, రాజస్థాన్ లో అరుణ్ సింగ్ ను కొనసాగించాలని నిర్ణయించారు. చత్తీస్ గఢ్ ఇన్చార్జి గా సీనియర్ నేత ఓం మాథుర్ వ్యవహరించనున్నారు. బిహార్ మాజీమంత్రి మంగళ్ పాండేకు పశ్చిమబెంగాల్ ఇన్చార్జిబాధ్యతలు అప్పగించింది బీజేపీ.