జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రదాడికి కుట్ర జరుగుతోంది..
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రదాడికి కుట్ర జరుగుతోంది. ఆయన ఇంటిపై రెక్కీ నిర్వహించినట్టు కస్టడీలో జైషే మహ్మద్ తీవ్రవాద సంస్ధకు చెందిన ఉగ్రవాది విచారణలో బయటపెట్టాడు. దీంతో అజిత్ దోవల్ ఇంటితో పాటు ఆయన ఆఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన హిదాయత్ ఉల్లా మాలిక్ అనే ఉగ్రవాదిని ఈనెల 6న జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో మాలిక్ ఇంకా పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ భవన్తో పాటు పలు వీఐపీ టార్గెట్లపై తాను రెక్కీ నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడు.మరికొందరు ఉగ్రవాదులూ రెక్కీలో పాల్గొన్నట్టు చెప్పాడు.