యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ గోపీనాథ్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కార్తీక్ ఇళయ భారతం ఛానెల్ని నిర్వహించే ప్రముఖ తమిళ యూట్యూబర్. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలుచేస్తుంటాడు.
https://twitter.com/ANI/status/1531138918220869633?s=20&t=zsIpHLp2G8Dufe3fZtMG1Q
పెరంబలూరు జిల్లా సిరువాచూర్లోని ఆలయాలకు నిధుల సేకరణ కారణంగా కార్తీక్ గోపీనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కార్తీక్ నిధుల సేకరణకు మిలాప్ యాప్ ను ఉపయోగించి సిరువాచూర్లోని అనేక అపవిత్ర ఆలయాల పునరుద్ధరణ కోసం నిధులు సేకరించాడు. పోకిరీలు ఇటీవల తమిళనాడు హిందూ మతపరమైన & ధర్మాదాయ శాఖ (HR&CE) ఆధ్వర్యంలోని దేవాలయాలలోని అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు. అయితే, యూట్యూబర్ ద్వారా HR&CE నిర్వహణ నియంత్రణలో ఉన్న దేవాలయం కోసం నిధుల సమీకరణపై కొంత చర్చ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు రావడంతో మే 30 ఉదయం కార్తీక్ను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడులోని డీఎంకే పరిపాలన ప్రత్యర్థులను అణిచివేసేందుకు బలవంతపు పద్ధతులను ఉపయోగిస్తోందని అంటూ కార్తీక్ అరెస్టును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై విమర్శించారు. పూర్తిగా బూటకపు ఆరోపణలపై కార్తీక్నాథ్ను అరెస్టు చేశారని ట్వీట్ చేశారు.
https://twitter.com/annamalai_k/status/1531107450329235456?s=20&t=cwDuFJUZoITrFXW4CnJ_Nw
తమిళనాడు పోలీసులు అధికార డీఎంకేను విమర్శిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. తబ్లిగి జమాత్ కు సంబంధించి వీడియో తీసినందుకు మరో యూట్యూబర్ మరిదాస్ను గతంలో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లీఘి జమాత్ సభ్యులకు సంబంధించిన వీడియో లింక్ను యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత మరిదాస్ని అరెస్టు చేశారు. 2020 జూన్లో దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధిని “అవినీతి పితామహుడు” అని వీడియోలో పేర్కొన్న తర్వాత అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.