మతమార్పిడి మాఫియా అరాచకాలకు బలైన తమిళనాడు బాలిక లావణ్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ కోర్టు ఆదేశించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని… తన కుమార్తె ఆత్మహత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు కోర్టును కోరారు.
తంజావూరుకు చెందిన ప్లస్ టూ చదువుతున్న విద్యార్థి లావణ్య జనవరి 9న పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. క్రైస్తవ మతంలోకి మారాలని వార్డెన్ బలవంత పెట్టిందని… ఒప్పుకోనందుకు తనను చిత్రహింసలకు గురిచేసిందని… బాత్రూమ్ లు కడిగించి, వంట చేయించిందని అందుకే చనిపోతున్నట్టు మరణ వాంగ్మూలం ఇచ్చింది బాలిక. అన్నిపనులూ చేయించడం వల్ల చదువు మీద కూడా దృష్టి పెట్టలేకపోయానని బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందతూ కన్నవాళ్లకు చెప్పుకుంది.
మతం మారనందుకే తన బిడ్డకు పాఠశాల యాజమాన్యం నరకం చూపిందని…ఆమె తల్లిదండ్రులూ ఆరోపించారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని..సీబీఐ విచారణ జరిపించాలని వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సీబీఐకి కేసును అప్పగించాలని ఆదేశించింది. అటు కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ లావణ్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ట్వీట్ చేశారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. లావణ్య కుటుంబ సభ్యులకు అన్నామలై పది లక్షల వ్యక్తిగత సాయం అందచేశారు.
Grateful to our @BJP4India Hon. National President Shri @JPNadda avl for constituting a four member team to give #JusticeForLavanya.
BJP will stand with the innocent departed soul despite the fact the ruling DMK govt is trying everything possible to scuttle the probe! pic.twitter.com/99mBUfJQFC
— K.Annamalai (@annamalai_k) January 27, 2022