తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కమలం గూటికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నేతలు కమలం గూటికి చేరుకోగా.. తాజాగా సినీప్రముఖులు కూడా బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. తమిళనాడులో ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ గురువారం నాడు బీజేపీలో చేరారు. టీ నగర్లోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురగన్ కండువా కప్పి ఆహ్వానించారు. సెంథిల్కు బీజేపీ సభ్యత్వ కార్డును అందజేశారు. మంచి పార్టీ అన్న నేపథ్యంలోనే బీజేపీలోకి చేరినట్లు సెంథిల్ తెలిపారు. అయితే సెంథిల్గతంలో అన్నాడీఎంకే ప్రచార కార్యకర్తగా పనిచేశారు. జయలలిత మరణించిన తర్వాత.. సెంథిల్ దినకరన్ నాయకత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగంలో చేరారు. అక్కడ వ్యవస్థాపక కార్యదర్శి పదవిని పొందారు. అయితే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో సెంథిల్ను దినకరన్ పార్టీ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కమలం గూటికి చేరారు. అయితే పార్టీ ఆదేశిస్తే అన్నాడీఎంకే అభ్యర్ధుల తరపున ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు.