తమిళనాడు నటి గాయత్రీ రఘురాం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఇక అన్నామలై సారథ్యంలో మహిళలకు ప్రాధాన్యత కాదుకదా …సమాన హక్కులు కూడా లేవని అన్నారు. గతేడాది నవంబర్లోనే గాయత్రిని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ఆరునెలల పాటు వేటు వేసింది పార్టీ. ఆమెను ఎలాంటి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని ఆదేశించారు. దీంతో రెండు నెలల తరువాత ఆమె పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో పార్టీపై విమర్శలు గుప్పించారు గాయత్రి.
https://twitter.com/Gayathri_R_/status/1610011792079720448?s=20&t=KZ09sJ4MY74sUi9OisUuMA