కర్నాటక బురఖా అమ్మాయిలకు తాలిబన్ మద్దతిస్తోంది. హిజాబ్ పట్ల వారి వైఖరిని ప్రశంసించింది. జాతీయ సంస్కృతి, విలువల కంటే ఇస్లామిక్ విలువలు గొప్పవంటున్నారు తాలిబన్ అధికారులు. ఈమేరకు ఖతార్ కార్యాలయంలోని IEA అధికారిక ప్రతినిధులు ఇనాముల్లా సమంగాని సహా సీనియర్ తాలిబన్ అధికారులు సమర్థిస్తున్నారు. ఇస్లామిక్ విలువల కోసం బాలిక నిలబడడం గొప్ప విషయమని ప్రశంసించారు.
హిజాబ్ కోసం భారతీయ ముస్లిం బాలికల పోరాటం అంటే… అది అరబ్, ఇరానియన్, ఈజిప్షియన్ పాకిస్థానీ సంస్కృతి కాదని…ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎన్నో త్యాగాలు చేస్తూ తమ మతపరమైన విలువను కాపాడుకునే ఇస్లామిక్ విలువ అని ఇనాముల్లా ట్వీట్ చేశారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ ప్రతినిధులను స్పోక్ మన్ గా వ్యవహరిస్తామని స్పోక్ పర్సన్ అనమని ఎందుకంటే ఇక్కడ ఎవరూ మహిళా అధికారులు లేరని అన్నారు.
కర్నాటకలో హిజాబ్ కోసం పట్టుబడుతున్న విద్యార్థినులు దాన్నే తమ మొదటి ప్రాధాన్యతగా, చదువును సెకండరీగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. తమ మత విలువలకోసం నిలబడి పోరాడడాన్ని లౌకిక ప్రపంచంలో చూడడం ఆనందంగా ఉందని సమంగాని అన్నారు. అల్లాహు అక్బర్ నినాదాలు చేసిన బురఖా బాలిక ఫొటోను జతచేస్తూ ట్వీట్ చేశారాయన.
https://twitter.com/HabibiSamangani/status/1491276486384709632?s=20&t=6DMUzK11yS_hY3rE56JUeQ
ఆ బాలికలు సెక్యులరిజం కోసం నిరసనలు చేస్తున్నారని సలీమ్ జావేద్ అనే పాకిస్తానీ వ్యాఖ్యకు స్పందిస్తూ ఘాటుగా స్పందించారు. జావేద్ ఒక ‘నకిలీ సెక్యులరిస్ట్’ అని ..హిజాబ్ అమ్మాయిలు ‘లౌకికవాదానికి’ మద్దతు ఇస్తున్నారనడం ద్వారా అతను ఇస్లాంపట్ల శతృత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడన్నారు. సమంగాని ఆ అమ్మాయిని ప్రశంసించడాన్ని ఖతార్ కార్యాలయంలోని అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ వంటి ఇతర సీనియర్ అధికారులూ సమర్థించారు. తమ కాలేజీ డ్రెస్ కోడ్ను ఉల్లంఘిస్తూ హిజాబ్ ధరించాలని డిమాండ్ చేస్తున్న ముస్లిం బాలికలకు తాలిబన్ల మద్దతు పెరుగుతోంది.
https://twitter.com/HabibiSamangani/status/1491474092654047234?s=20&t=6DMUzK11yS_hY3rE56JUeQ
గత ఏడాది ఆగస్టులో, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత బురఖా లేదా ఆఫ్ఘనిస్తాన్లోని హిజాబ్ను తప్పనిసరి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళాహక్కుల్ని అణచివేస్తూ, మహిళా కళాకారుల షోలను సైతం రద్దు చేయాలని టెలివిజన్ లనూ ఆదేశించారు. మహిళా విలేఖరులూ పూర్తిగా నిండైన వస్త్రాలే ధరించాలని ఆదేశించారు.
అసలైతే తాలిబన్ ల చేతికి ఆఫ్గన్ వెళ్లిన తరువాత చాలామంది స్థానిక మహిళలు రంగురంగుల దుస్తులు ధరించి తాలిబన్ల హిజాబ్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షరియా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. తాలిబాన్ ముష్కరులు కాబూల్లోని మహిళా హక్కుల కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. ప్రాథమిక హక్కులకోసం డిమాండ్ చేసినందుకు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మన దేశంలో తాలిబన్లలాగే లెఫ్ట్ లిబరల్స్ ఆలోచిస్తున్నారు. యూనిఫాం డ్రెస్ కోడ్పై ఏర్పాటు చేసిన నిబంధనలను ఉల్లంఘించేలా ముస్లిం బాలికలను ప్రోత్సహిస్తుండడం ఆసక్తికరం.