తాలిబాన్ మోడల్ ను అమలుచేస్తున్నాయి కేరళలోని విద్యాసంస్థలు. ఓ ప్రభుత్వవైద్య కళాశాలలో ‘జెండర్ పాలిటిక్స్’ అంశంపై ప్రసంగం సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులను వేరుగా కూర్చోబెట్టి కర్టెన్ వేశారు.వివాదాస్పద ఇస్లామిస్ట్ అబ్దుల్లా బాసిల్ తో ఆ స్పీచ్ ఇప్పించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఆఫ్గనిస్తాన్లోని తాలిబన్ తరహా మోడల్ ను అమలుచేస్తోంది కేరళలోని పినరయి సర్కారు.అక్కడిలానే కేరళలోని ఓ విద్యాసంస్థలో విద్యార్థినీ, విద్యార్థులను కర్టెన్ తో వేరు చేసి క్లాసులు నిర్వహించింది. అదేదో మారుమూల గ్రామమో…ప్రాథమిక పాఠశాలనో అస్సలు కాదు. త్రిస్సూర్లోని ప్రభుత్వం వైద్యకళాశాలలో ఇది జరిగింది.ఆ కళాశాల ఇటీవల ఇస్లామిస్ట్ కాన్ఫరెన్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. వివాదాస్పద ఇస్లామిస్ట్ అబ్దుల్లా బాసిల్ స్పీకర్..అంశం జెండర్ పాలిటిక్స్.
జెండర్ పాలిటిక్స్ పై అబ్దుల్లా ప్రసంగం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను చెరోవైపు కూర్చోబెట్టారు. అబ్దుల్లా బాసిల్ ఈ సమావేశాన్ని తీవ్రవాద గ్రూప్ విస్డమ్ బ్యానర్ పైనిర్వహించాడు.
https://twitter.com/eOrganiser/status/1545235220156252163?s=20&t=JgC0gvk3OAHfw6NSmyz2wg
‘జెండర్ పాలిటిక్స్ బిహైండ్ లైవ్స్ అండ్ ఐడియల్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. లింగ విపక్షపై వక్తలు ప్రసంగించారు. దానికి అందరూ హాజరయ్యారు. కానీ ఆడవాళ్లను, మగవాళ్లని వేరు చేశారు. మధ్యలో కర్టెన్ అడ్డుగా వేసి నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. ఇది ఆఘ్గనిస్తానా…కేరళను తాలిబన్లు ఏలుతున్నారా అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. జెండర్ పాలిటిక్స్ మీద సెమినార్ అంటూ వివక్ష పై చర్చిద్దామని చెప్పి ఇదేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.
ఈవెంట్ను నిర్వహించిన గ్రూప్కు చెందిన అధికారి ఒకరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లింగం ఆధారంగా విద్యార్థులను వేరు చేయడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా సమర్థించారు నిర్వాహకులు. అయితే ఆ కార్యక్రమంతో సంబంధం లేదని మెడికల్ కాలేజీ యూనియన్ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలు ప్రోత్సహించడం తమ స్టాండ్ కాదని… కాలేజీ ప్రగతిశీల ఆలోచనలతో సాగుతోందని యూనియన్ స్పష్టం చేసింది.
కేరళలో పెరుగుతున్న ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతున్న విషయంతెలిసిందే. 2021 నుండి వచ్చిన ఒక నివేదిక రాష్ట్రంలో ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్ల ఉనికిపై అనుమానాలున్నాయి.ఈ తాలిబానీ అభ్యాసాన్ని అనుసరిస్తున్న క్లమంలో… 2020లో, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రక్షా బంధన్ పండుగను జరుపుకోరాదని కేరళ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమ్లా బీవీ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిందే.