మానవహక్కులు, అంతర్జాతీయ సహాయం పాశ్చాత్య ప్రపంచంతో చర్చల కోసం ఆఫ్గనిస్తాన్ నుంచి తాలిబన్ల ప్రతినిధి బృందం నార్వే చేరుకుంది. ఆఫ్గనిస్తాన్లో మానవహక్కులు తదితర అంశలపై మాట్లాడేందుకు వెళ్లిన తాలిబన్లు ఇతర దేశాల అధికారులనూ కలవనున్నాయి.
ఆఫ్గనిస్తాన్లో క్షీణిస్తున్న మానవతాసంక్షోభం నేపథ్యంలో దేశ తాత్కాలిక విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ నేతృత్వంలోని తాలిబన్ బృందం ఆదివారం నార్వే ఓస్లోకు చేరుకుంది. పశ్చిమదేశాల ప్రభుత్వాధికారులు, అక్కడున్న ఆఫ్గన్ పౌరులతో మూడురోజుల పాటు చర్చలు జరపనుంది. ఇంకా పలు అంశాలపై చర్చించేందుకు నార్వే తాలిబన్ బృందాన్ని ఆహ్వానించింది.
జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు బృందం ఓస్లోలో పర్యటిస్తుందని నార్వే విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాలిబన్ల తిరుగుబాటు గురించి మే మాట్లాడబోం. మేం చెప్పేది వారికి చెప్తాం. మా డిమాండ్లను తాలిబన్లు అమలు చేస్తారో లేదే మాకు తెలియదు అని ఆదేశ అధికారులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లో పౌరుల పరిస్థితి, ముఖ్యంగా అక్కడ మానవహక్కులపై మాట్లాడేందుకు నార్వేజియన్ అధికార ప్రతినిధులు సహా అనేక ఇతర మిత్రదేశాల అధికారులను తాలిబన్ బృందం కలవనుంది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇతర మిత్ర దేశాలు జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా బాలికల విద్య, మహిళలహక్కులు చర్చల్లో ప్రధాన ఎజెండా. ఆఫ్గనిస్తాన్ మహిళలు ఎలాంటి హక్కులు లేకుండా బానిసత్వంలో బతుకుతున్నారు. వారి హక్కుల్ని పునరుద్ధరించాలని నార్వే తాలిబన్లను డిమాండ్ చేయనుంది.
ఈ చర్చల ద్వారా ఆఫ్గన్ కు మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్టు తాలిబన్ స్పోక్ జబీహుల్లా ముజాహిద్ ఆకాంక్షించారు.
పాశ్చాత్య ప్రపంచపు డిమాండ్లు నెరవేర్చడానికి ఇస్లామిక్ ఎమిరేట్ చర్యలు తీసుకుంటుంది. యురోపియన్ దేశాలు, పశ్చిమదేశాలు సహా అన్ని దేశాలతో దౌత్యమార్గాల్లో మా సంబంధాల్ని బలోపేతం చేస్తూ దేశంలోని యుద్ధవాతావరణాన్ని మార్చాలనుకుంటున్నామని అన్నారు.
తాలిబన్ ప్రతినిధి బృదంకోసం నార్వే ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. సున్నీ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్వర్క్ నాయకుడు అనాస్ హక్కానీ కూడా ఈ బృందంలో ఉండడంతో ఒసోలో పలువురు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థను ఎలా ఆహ్వానించారని వారు ప్రశ్నిస్తున్నారు.
https://twitter.com/Afshin_Ismaeli/status/1484902722696589323?s=20
అమెరికా దళాలు ఆఫ్గన్ నుంచి నిష్క్రమించిన తరువాత ఆ దేశం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిన సంగతి తెలిసింది. నాటి నుంచి తాలిబన్ నాయకులు ఐరోపా దేశం వెళ్లడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు రష్యా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్, చైనా , తుర్క్మెనిస్తాన్లను తాలిబన్లను సందర్శించారు.
https://twitter.com/Afshin_Ismaeli/status/1485023088110669830?s=20
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం… ప్రస్తుతం 23 మిలియన్ల ఆఫ్ఘన్లు అంటే దేశ జనాభాలో 55 శాతం మందిని ఆకలి కేకలు పెడుతున్నారు. అక్కడ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక్కసంవత్సరానికి…ఇతర దేశాలనుంచి 4.4 బిలియన్ డాలర్లు విరాళాన్ని కోరుతోంది ప్రభుత్వం.