ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లోని సైనిక ఆసుప్రతిపై జరిగిన ఉగ్రవాద దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ హమ్దుల్లా మొఖ్లిస్ మరణించినట్లు తాలిబన్ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడిలో 19 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ప్రకటించింది. మొఖ్లిస్ ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్వర్క్ సభ్యుడు, ప్రత్యేక దళాల అధికారి కూడా. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత మరణించిన ఆ సంస్థ ఉగ్రవాదుల్లో మొఖ్లిస్ సీనియర్. తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్లో హింసాకాండ తీవ్రంగా ఉంది. ఉగ్రవాద దాడులు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి.