ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై…ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు దానికి బదులివ్వాలంటూ ఈడీకి నోటీసులు పంపింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఉన్నానని… లిక్కర్ స్కాం కేసులో తాను కవితకోసం పనిచేశానని ఈడీకి పిళ్లై చెప్పినట్టు తెలిసింది. అందుకు సంబంధించిన స్టేట్మెంట్ ను ఈడీ రిమాండ్ రిపోర్టులో పొందుపర్చింది. రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేసిన ఈడీ… కవితనూ విచారణకు పిలిచింది. శనివారం ఆమెను ఈడీ ప్రశ్నించనుంది.అయితే ఈ సమయంలో పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పడం కోర్టుకు వెళ్లడంతో కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
https://twitter.com/hmtvnewslive/status/1634142409599643654?s=20