తాజ్మహల్ పేలుతుంది.. అగంతకుడి ఫోన్
తాజ్మహల్ను పేల్చేస్తామంటూ మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజ్మహల్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసిన అగంతకులు.. అందులో బాంబులు పెట్టామంటూ తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. బాంబ్ స్క్వాడ్,సీఐఎస్ఎఫ్కి సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తాజ్మహల్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్ధాలు దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫోన్ కాల్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది ఫేక్ కాల్గా గుర్తించారు. అగంతకుడు ఫోన్ చేసిన సమయంలో తాజ్మహల్ పరిసరాల్లో వెయ్యి మందికి పైగా ఉన్నారని.. వారిని వెంటనే బయటకు పంపించామని తెలిపారు. అయితే సైనిక నియామకంటో అన్యాయం జరిగిందని.. అందుకే ఇలా ఫేక్ కాల్ చేశానంటూ ఫోన్లో తెల్పినట్లు ఆగ్రా ఎస్పీ శివరాం యాదవ్ తెలిపారు. కాగా, గతంలో కూడా తాజ్మహల్ను కూల్చేస్తామంటూ పలుమార్లు బెదిరిపు కాల్స్ వచ్చాయి. అయితే అప్పుడు కూడా అవన్నీ ఫేక్ కాల్స్గా తేలింది.