ప్రపంచ ప్రసిద్ధి కట్టడం తాజ్మహల్పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే. యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.. తాజ్మహల్ త్వరలోనే పేరు మారుతుందన్నారు. తాజ్మహల్ కాస్త రామ్మహల్గా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు బైరియా నియోజకవర్గంలో మాట్లాడుతూ.. తాజ్మహల్పై వ్యాఖ్యానించారు. కాగా, గతంలో తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం అని.. తేజోమహాలయాన్ని కూల్చి.. తాజ్మహల్గా మార్చారంటూ పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. యెగీ సర్కార్ తాజ్మహల్ను రామ్మహల్గా మార్చుతుందని సురేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా యోగీని శివాజీ వారసుడిగా పోల్చారు.