అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జిహాదీ మూకలకు గతంలో మసూద్ బహిరంగంగా మద్దతు ఇచ్చాడని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. మసూద్ ఖాన్ అనేక సందర్భాల్లో జిహాదీలకు అండగా నిలిచారు. ఐదేళ్లనాడు భారత బలగాల చేతిలో హతమైన ఉగ్రవాది బుర్హన్ వనీకి నివాళులర్పించారు. జూలై 2021 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
బుర్హన్ వనీ ఐదో వర్దంతి సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేశారు మసూద్. బుర్హాన్ వనీ మృతి బాధాకరం. వనీ భూమిపై లేకపోవచ్చు. కానీ ఎప్పటికీ మన హృదయాల్లో జీవించి ఉంటాడు. అతను ఒక లక్ష్యం కోసం తన ప్రాణాలు అర్పించాడు. పాకిస్తాన్ మీడియా చెప్పినట్టు ప్రంపచవ్యాప్తంగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు బుర్హాన్ రోల్ మోడల్ అంటూ కొనియాడారు. “కాశ్మీర్ విముక్తి, భారత్ ఓటమిని ఎవరూ అడ్డుకోలేరు’ అని ఆయన అన్నారు.
ఇక జూన్ 2017లో యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ హిజ్బుల్ ముజాహిదీన్ ను ఉగ్రవాద సంస్థగా పేర్కొంటే…ఆ సంస్థకు మద్దతు ప్రకటించాడు మసూద్. ముజాహిదీన్ నాయకుడు సలావుద్దీన్ పై అమెరికా విధించిన ఆంక్షలు అన్యాయమైనవనీ అన్నాడు. అలా ప్రతీసందర్భాల్లో హిజ్బుల్ కు మద్దతిస్తూనే ఉన్నాడు.
జియో టీవీలో వచ్చిన ఓ ఇంటర్వ్యూలో హిజ్బుల్కు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. 2020లో హిజ్బుల్ టాప్ కమాండర్ జునైద్ సెహ్రాయ్ మరణించిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేసిన మసూద్., తన మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అత్యున్నత త్యాగం చేసిన సెహ్రాయ్ కు నివాళి అంటూ అభినందించాడు . వారి త్యాగాలు విముక్తి ఉద్యమానికి స్పూర్తి అంటూ పిలుపునిచ్చాడు.
ఇతర ఉగ్రవాద సంస్థలకూ మద్దతిచ్చాడు. 2019లో ఇస్లామాబాద్లో జరిగిన అఖిలపక్ష కాశ్మీర్ సంఘీభావ సదస్సులో పాల్గొన్నారు.హర్కత్-ఉల్-ముజాహిదీన్ (HuM) వ్యవస్థాపకుడు ఫజ్లుర్ రెహ్మాన్ ఖలీల్తో వేదికను పంచుకున్నాడు. ఖలీల్ను 1997లో US స్టేట్ డిపార్ట్మెంట్ టెర్రరిస్ట్గా గుర్తించింది. 2014లో గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది.
ఖాన్ దక్షిణాసియా ఇస్లామిస్ట్ ఉద్యమం జమాత్-ఇ-ఇస్లామీకి మద్దతుదారు. meforum.orgలోని కథనం ప్రకారం.. 1971లో బంగ్లాదేశీయుల మారణహోమానికి ఈ సంస్థకు చెందిన కిల్లింగ్ స్క్వాడ్లు పాకిస్తానీ సైన్యంతో చేతులు కలిపి పనిచేశాయి. 1971లో అత్యాచారం, మారణహోమానికి సంబంధించి అనేక కేసుల్లో అతని పాత్రను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్థారించింది. 2016లో మోతియుర్ రెహమాన్ ను ఉరితీశారు.
ఖాన్ అధికారిక వెబ్సైట్లో, అతని ప్రసంగాలున్నాయి. జమ్ముకశ్మీర్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన జమాతీ ఇస్లామ్ పాకిస్తానీ ప్రతినిధులకు నివాళులు అంటూ చెప్పుకొచ్చారు. ఖాన్ అఫియా సిద్ధిఖీ, అలియాస్ లేడీ అల్-ఖైదాకు కూడా మద్దతునిచ్చాడు.
ఖాన్ పేరు IHH హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్కి లింక్ చేయబడింది, ఇది టర్కిష్ ఇంటెలిజెన్స్ లింక్డ్ ఛారిటీ. meforum.org కథనం ఈ సంస్థ లిబియా, సిరియాలోని అల్-ఖైదా యొక్క జిహాదిస్ట్ గ్రూపులకు ఆయుధాలను సరఫరా చేస్తుందని ఆరోపించింది. కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోపించింది. IHH జర్మనీ, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్లో ఉగ్రవాద సంస్థ.
ఖాన్ సహాయాన్ని అందించిన మరొక తీవ్రవాద స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ (HHRD). ఈ సంస్థ జమాత్-ఇ-ఇస్లామీకి చెందిన అమెరికన్ ప్రాక్సీ. 2017లో హెచ్హెచ్ఆర్డీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధం ఉన్న అల్-ఖిద్మత్ ఫౌండేషన్కు నిధులు సమకూర్చినట్లు HHRDపై ఆరోపణలున్నాయి.
2019లో ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ISNA) నిర్వహించిన సదస్సులో భారత్కు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా…2018లో హిజ్బుల్ ముజాహిదీన్ CAD 1,36,000 రూపాయల్ని కాశ్మీర్ సంస్థకు బదిలీ చేసిన తర్వాత ISNA బ్రాంచ్ ను కెనెడాలో నిలిపేశారు..
ఇమ్రాన్ పిలుపు తరువాత మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేయడానికి యూఎస్ ఆధారిత పాకిస్తాన్-పాలన-సంబంధిత లాబీయింగ్ గ్రూపులు, ఇస్లామిస్ట్ సంస్థలు వందలవేల డాలర్లు ఖర్చు చేశాయి. మసూద్ ఖాన్ ఈ లాబీయింగ్ గ్రూపులకు మద్దతునివ్వడమే కాకుండా యాసిన్ మాలిక్, షబీర్ షా వంటి తీవ్రవాదులకు, దివంగత సయ్యద్ అలీ గిలానీ వంటి జిహాదీ నాయకులకు మద్దతుగా నిలిచాడు.
ఇక ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ బహిరంగ మద్దతు ఇచ్చింది. మసూద్ను USAలో పాకిస్తాన్ రాయబారిగా నియమించడం అంటే ఇస్లామిక్ విధానాలను, జిహాదీ సిద్ధాంతాలను ప్రోత్సహించడం, టెర్రరిస్టులకు సహకరించేందుకు చేస్తున్న ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ పీవోకేను ఆజాద్ కశ్మీర్ గా పిలుస్తుంది. ఆజాద్ కశ్మీర్ ప్రధానులు, అధ్యక్షులు ఇస్లామాబాద్ ఆదేశాలను పాటించే కీలుబొమ్మలే. జమ్ముకశ్మీర్ స్వతంత్ర్యం పేరుతో వారిస్తున్న పిలుపు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.