ఆధునిక భారతీయ మహిళ ఆత్మగౌరవ ప్రతీక అని సీనియర్ న్యాయవాది, ప్రజ్ఞాభారతి బాధ్యురాలు విజయభారతి అన్నారు. అనాదినుంచి ఆదిపరాశక్తిగా భారతీయ సమాజ అభ్యున్నతికి కృషిచేసింది మహిళే అని ఆమె అన్నారు.
వరంగల్లోని గీతాంజలి మహిళా డిగ్రీ కాలేజీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య వక్తగా విజయభారతి హాజరయ్యారు.. Role of Women in the society అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. శతాబ్దాలుగా ఇంటాబయటా చక్కబెట్టుకుంటూ వచ్చిన మహిళలపై దాడులు విచారకరమని ఆమె అన్నారు. 200 మందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని సమాజంలో మహిళ పాత్రపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు..