ద్వారకాశారదాపీఠాధిపతిగా దండి స్వామి సదానందస్వామి నియమితులయ్యారు. పీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతీ రెండు రోజుల క్రితం శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలోని ఆయన ఆశ్రమంలో స్వామి తుది శ్వాస విడిచారు. సోమవారం అధికారిక లాంచనాలతో ఆయన అంతిమసంస్కారాల క్రతువు పూర్తి చేశారు. ఆయన స్థానంలో సదానందసరస్వతి స్వామిని, జ్యోతిష పీఠాధిపతిగా అవిముక్తేశ్వరానంద సరస్వతి నియమితులయ్యారు.