వెస్ట్ బెంగాల్లో నామినేషన్ల పర్వం జొరందుకుంది. నందిగ్రామ్ నుంచి సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఇదే నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్ధి సువేందు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, నామినేషన్ వేసే ముందు సువేదందు అధికారి నందిగ్రామ్లోని ఓ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సువేంద అధికారి.. దీదీపై 50 వేల మోజార్టీతో గెలుస్తానన్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలకు అన్ని దారులు మూసుకుపోయాయని.. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలంటే బీజేపీ అధికారింలోకి రావాల్సిందేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎంసీ పార్టీ ఓ ప్రైవేట్ కంపెనీగా మారిపోయిందని.. అందులో సీఎం మమతా, ఆమె మేనల్లుడు మాత్రమే మాట్లాడగలరని.. మిగతా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఉండదని ఆరోపించారు.