
V Deepika(Left) R Vamshika(Right)
తెలంగాణలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు.
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీ క్యాంపస్ లో ఫస్టియర్ చదువుతున్న వంశిక కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందపడి చనిపోయింది. కామారెడ్డికి చెందిన వంశిక హాస్టల్లో చేరిన వారానికే విగతజీవిగా మారడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే ప్రమాదవశాత్తూ పడిపోయిందా లేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అటు వంశిక విషాదం జరిగిన కొన్ని గంటలకే బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం. పీయూసీ విద్యార్థి సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపిక అనుమానిత స్థితిలో చనిపోయింది. దీపిక బాత్రూంకు వెళ్లి తిరిగి ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో సెక్యూరిటీ డోర్ తెరిచి చూడగా అపస్మారక స్థితిలో ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.