సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వాకింగ్ కు వెళ్లిన ఆయన…తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆయన …ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉదయం గుర్జకుంటలోని చేర్యాల రోడ్డులో గాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు.ముందు సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారు. భూతగాదాలు కానీ, రాజకీయ కక్షలు కానీ ఆయనమీద దాడికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.