బిహార్లో హోలీ సందర్భంగా హింస చెలరేగింది. ఓ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. డీజే ప్లే చేస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించాడంటూ అనిరుధ్ అలియాస్ అమృత్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందే డీజే సిస్టమ్ ను జప్తు చేసుకెళ్లారు. అయితే సిస్టమ్ ను విడిపించుకునేందుకు వెళ్లిన యాదవ్ ను పోలీసులు చితకబాదారు. దీంతో అతను కస్టడీలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఆ దాడిలో ఓ కానిస్టేబుల్ చనిపోయారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.దీంతో నిరసనకు దిగిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
https://twitter.com/MirrorNow/status/1505724692816048131?s=20&t=5FoGLZi1kLJE57YDiDilTw
పోలీసులే తన సోదరుడిని కొట్టి చంపారని అనిరుద్ సోదరుడు కన్హయ్య యాదవ్ ఆరోపించాడు. తాము ఎలాంటి హింసకు పాల్పడలేదని పోలీసులే వారి వాహనాలకు నిప్పుపెట్టి పారిపోయారని చెప్తున్నాడు. అయితే అనిరుధ్ ను తాము కొట్టలేదని తేనెటీగలు దాడి చేయడం వల్ల చనిపోయాడని జిల్లా ఎస్పీ ఉపేంద్రనాథ్ తెలిపారు. అసలు అతన్ని కస్టడీలోకే తీసుకోలేదని… స్టేషన్ ఆవరణలో చేతిపంపు నీళ్లు తాగుతుండే తేనెటీగల గుంపు దాడిచేసిందని చెప్పారు. ఆస్పత్రిలో అతని చెవిలోనుంచి తేనెటీగలు బయటపడ్డాయని అన్నారు. ఇక స్థానికుల దాడిలో చనిపోయిన కానిస్టేబుల్ రామ్ జతన్ రాయ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.