నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఆ నలుగురు ఓటేశారని పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందునే ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నలుగురిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు కాగా..ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే.