హిజ్బుల్ ముజాహిదీన్, జమాత్ ఇ ఇస్లామీ, ఇస్లామిక్ స్టేట్తో సహా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన ఐదుగురు ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐదుగురు అధికారుల సేవలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(c) ప్రకారం తీవ్రవాద సంస్థలకు ఓవర్గ్రౌండ్ కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం తెలియడంతో వారిని సస్పెండ్ చేశారు.
సెక్యూరిటీ లింక్లను ఎప్పటికప్పుడు చూసేందుకు వాచ్డాగ్గా వ్యవహరించే స్క్రూటినైజింగ్ కమిటీ SPO లుగా పనిచేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయుడు, కంప్యూటర్ ఆపరేటర్, రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఒక నర్సుతో సహా ఐదుగురు ఉద్యోగుల సేవలను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. పుల్వామా, శ్రీనగర్, అవంతిపొర, కుల్గాం సహా బారాముల్లా జిల్లాలతో సహా J&K కేంద్రపాలిత ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి రద్దు చేశారు. ఈ ఉగ్రవాదులు ముందు పనిచేసిన వేర్పాటువాదు వ్యక్తుల సహాయంతో నియమితులైనట్టు తెలుస్తోంది.
సస్పెండైన ఉద్యోగులలో తౌసీఫ్ అహ్మద్ మీర్, గులాం హసన్ పర్రే, అర్షిద్ అహ్మద్ దాస్, షాహిద్ హుస్సేన్ రాథర్, షరాఫత్ అలీ ఖాన్ ఉన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)