తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈటలను సస్పెండ్ చేయాలంటూ సభావ్యవహారాల మంత్రి వేములప్రశాంత్ రెడ్డి తీర్మానం . దీంతో ఆ సెషన్ ముగిసేవరకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
అంతకుముందు సభలో మాట్లాడుతూ స్పీకర్ ను ఈటల మరమనిషి అని సంబోధించారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అభ్యంతరం తెలిపారు. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు.అయితే స్పీకర్ పైఅనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పక్షం డిమాండ్ చేసింది. అందుకు ఈటల అంగీకరించలేదు. అయితే ఈటల సస్పెండ్ చేయించుకోవాలని చూస్తున్నారని..కానీ ఆయన సభలోనే ఉండాలని తాము కోరుకుంటున్నామని…సారీ చెప్పి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. తనను సారీ చెప్పమన్నందుకు ఈటల అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అసెంబ్లీలో ఉండడం ఇష్టంలేదాఅని..అందరూ బెదిరిస్తున్నారా..ఏం చేస్తారని ఈటల గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య స్వల్పవాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఆయన్ని సస్పెండ్ చేశారు.