తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులను సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు భిన్నంగా సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో స్పీకర్ తీరు కీలుబొమ్మగా మారిందని, సస్పెన్షన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)