ఏపీఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం. అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా 8మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీకి 22 ఓట్లు కావల్సి ఉండగా… టీడీపీ బలం 19 మాత్రమే. అయితే అనురాధకు పార్టీ ఓట్లకన్నా అదనంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి. అయితే అనురాధ గెలుపుతో వైసీపీ నుంచి ఓడిపోయే ఆ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అనురాధ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల పట్టభద్రుల కోటా ఎన్నికల్లోనూ మూడింటికి మూడు స్థానాలనూ టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.