మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులోకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పరువు నష్టం కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది. 2019లో కర్నాటకలో ప్రచారంలో భాగంగా…దేశంలోని దొంగలందరిపేర్లు మోదీ అనే ఎందుకు ఉంటున్నాయంటూ రాహుల్ కామెంట్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో కేసు వేశారు. రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సూరత్ కోర్టుకు హాజరయ్యారు. తీర్పునిస్తూ రెండేళ్ల జైలుశిక్ష వేశారు న్యాయమూర్తి. తీర్పు సమయంలో అక్కడే ఉన్న రాహుల్ దిగ్భ్రాంతి చెందారు. అయితే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేశారు. తీర్పుపై అప్పీలు వెళ్లేందుకు అతనికి 30 రోజుల బెయిల్ ఇచ్చింది. అప్పటివరకు తీర్పును తాత్కాలికంగా నిలిపేయనున్నారు.
సూరత్ ఈ తీర్పుతో కాంగ్రెస్ శ్రేణులూ షాకయ్యారు. ఈ తీర్పుతో ఒకరకంగా ఆయన మెడపై అనర్హత కత్తి వేలాడుతున్నట్టే. ఇప్పుడు 30 రోజుల బెయిల్ దొరికినా…తరువాత న్యాయపరమైన చిక్కులు ఎదురుకావచ్చంటున్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడుతుంది. అంతేకాదు సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చు. పై కోర్టు సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
అటు సూరత్ కోర్టు తీర్పుపై స్పందించిన ప్రియాంక… తన సోదరుడు ఎవరికీ, ఏపరిస్థితులకూ భయపడబోడని అన్నారు. ఇక తీర్పుపై చట్టప్రకారం ముందుకెళ్తామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
https://twitter.com/ANI/status/1638782904418328577?s=20