దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందర్నీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18, 2022న ఏజీ పెరరివలన్ విడుదలలో అనుసరించిన విధానాన్నే మిగిలిన దోషుల విషయంలోనూ అనుసరిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నకూడిన ద్విసభ్య ధర్మాసనం
రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని , జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్లకు విముక్తి ప్రసాదించింది. 1991 నుంచి 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు వాళ్లంతా.
1991 మే 21న చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరుంబదూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీ హత్యజరిగింది. ఎల్టీటీఈకి చెందిన థాను/థెన్మోజి రాజరత్నం ప్రణాళిక ప్రకారం బెల్ట్ బాంబ్ను పేల్చేసుకోవడంతో రాజీవ్ గాంధీ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యతో సంబంధముున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఏడుగురిలో ఒకరైన నళిని ఆ సమయంలో గర్భవతిగా ఉంది. జైలులోనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో కేసు దర్యాప్తునకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. 20 రోజులకే 19 ఏళ్ల వయసులో పెరరివలన్ ను టాడా చట్టం కింద అరెస్ట్ చేశారు. రాజీవ్ హత్యోదంతంలో ఎల్టీటీఈ పాత్ర ఉందని ప్రత్యేక సిట్ తేల్చింది. దీంతో అరెస్టయిన వారందరిపైనా టాడా కింద కేసులు పెట్టారు. చనిపోయిన 12 మందితో పాటు పరారైన ముగ్గురు సహా 41 మందిని సిట్ నిందితులుగా పేర్కొంది. వారిలో మురుగన్, సంథాను, ఏజీ పెరరివలన్, నళిని సహా మొత్తం 26 దోషులకు 1998లో మరణశిక్షపడింది. ఏడాదికి వారు పెట్టుకున్న అప్పీల్ ను సుప్రీం తిరస్కరించింది. దిగువస్థాయి కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. మరో ముగ్గురికి జీవితకాల శిక్ష విధించిన కోర్ట్.. ఈ హత్య కేసులో టాడా నిబంధనలను తొలగించింది. ఫలితంగా మరణశిక్ష పడిన 19 మందికి ఉపశమనం దక్కింది. మరోవైపు దోషులుగా తేలిన నళిని, మురుగన్, శాంథాను, పెరవివలన్ తమిళనాడు ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరగా ప్రభుత్వం తోసిపుచ్చింది.
2000 సంవత్సరంలో సోనియా అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షకు తగ్గించాలని తమిళనాడు గవర్నర్ కు నాటి సీఎం కరుణ సర్కారు సిఫార్సు చేసింది. తరువాత శాంథాను, మురుగన్, పెరరివలన్ భారత రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు.
2011లో వీరి క్షమాభిక్ష పిటిషన్ను నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. అదే ఏడాది సెప్టెంబర్ 9న ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్ హైకోర్ట్ స్టే విధించింది. వీరి మరణశిక్షను జీవితకాల శిక్షకు తగ్గించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి నాటి ముఖ్యమంత్రి జయలలిత ఆమోదం తెలిపారు. 2018లో ఏడుగురు నిందితుల విడుదలకు మరోసారి తమిళనాడు కేబినెట్ సిఫార్స్ చేసింది. 2019లో నళిని శ్రీహరన్కు మొదటిసారి సాధారణ పెరోల్ లభించింది. నెలా 20 రోజులపాటు ఆమె బయట ఉన్నారు.మరోసారి 2021లో తల్లిఆరోగ్యం బాగాలేదని ఆమె విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం మరోసారి పెరోల్ ఇచ్చింది. అదే ఏడు మరో దోషి రవిచంద్రన్కు కూడా పెరోల్ లభించింది.
మే 18 ,2022 న సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత పెరరివలన్ జైలు నుంచి విడుదలయ్యాడు. 2022 సెప్టెంబర్లో నళిని, రవిచంద్రను ముందస్తు విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్ తాజాగా తీర్పునిచ్చింది.