
Supreme Court of India
గుజరాత్ బల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అలాగే శిక్షాకాలం తగ్గింపుపొందిన వారిని కేసులో కక్షిదారులుగా చేర్చాలని సీజేఐ జస్టిస్ రమణ ఆదేశించారు. తదుపరి విచారణను రెండువారాలకువాయిదా వేసింది.
గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగినట్టు రుజువైంది.
వారికి సీబీఐ కోర్టు జీవితఖైదు విధించింది. దోషులంతా 11 ఏళ్లు కారాగార శిక్ష అనుభవించారు. అయితే తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని విజ్ఞప్తిని పరిశీలించాలంటూ సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం…నివేదిక మేరకు రిమీషన్ కింద స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా విడుదల చేసింది. అయితే వారు విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీపీఎం నేత సుభాషిణి అలీ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు.
Bilkis Bano case | SC says – question is, under Gujarat rules, are the convicts entitled to remission or not? We've to see whether there was application of mind in this case while granting remission, SC says.
SC directs petitioners to make 11 convicts party in the case here. pic.twitter.com/sMTa4ZxruS
— ANI (@ANI) August 25, 2022