మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే సీబీఐ ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్ను సుప్రీం తొలగించింది. అలాగే కొత్త సిట్ ఏర్పాటు ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందుంచింది. కేసులో ఏ5 నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై కీలక తీర్పునిచ్చింది. ఏప్రిల్ 30లోగా విచారణను ముగించాలంది. అలాగే ఇప్పటి వరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ ర్యాంక్ అధికారి రాంసింగ్ను తొలగించింది. డీఐజీ కేఆర్ చౌరాస్య నేతృత్వంలో మరో సిట్ దర్యాప్తు కొనసాగించనుంది.