గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి కేసు వేసిన ఆరోపణలపై అరెస్టైన న్యాయవాది తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండు నెలలుగా తీస్తా పోలీసు కస్టడీలో ఉన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ ఓ షరతు పెట్టింది కోర్టు . ఆమె తన పాస్పోర్ట్ను సమర్పించాల్సి ఉంటుందని…తదుపరి విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలనీ ఆదేశించింది. బెయిల్ సాధ్యం కాని పోటా, ఉపా వంటి కేసులు తీస్తాపై లేవని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.
గుజరాత్ ఇదే సమయంలో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టుకు మరో సూచన కూడా చేసింది. తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని గుజరాత్ హైకోర్టుకు తెలిపింది.
ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఆమెపై తీవ్రమైన ఆరోపణలేవీ లేవని, ఐపీసీలోని సెక్షన్ 437 కింద సాధారణ నేరాన్నే మోపారని జస్టిస్ లలిత్ అన్నారు.