లఖింపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టుమధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2021 అక్టోబర్ 3వతేదీన లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన రైతులమీదికి తన వాహనాన్ని పోనిచ్చిన ఘటనలో 8 మంది చనిపోయారు. ఆశిష్ బెయిల్ పిటిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆశిష్ నేరం తీవ్రమైనదని, హేయమైనదని సుప్రీం కోర్టుకు ఉత్తరప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ తెలిపారు. అయితే సుప్రీం ఇవాళ అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది.