మహారాష్ట్ర పాల్ఘర్లో సాధువులపై మూకుమ్మడిదాడి, హత్య కేసు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఘటనపై సీబీఐ విచారణకు అనుమతించాలంటూ షిండే సర్కారు సుప్రీంను కోరింది. ఇంతకుముందున్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించలేదు.
2020 ఏప్రిల్ 16 పాల్ఘర్ జిల్లా గడ్చిచాలె సమీపంలో ఇద్దరు సాధువులు మహరాజ్ కల్పవృక్షగిరి, సుశీల్గిరి మహరాజ్, వారి కారు డ్రైవర్ నిలేశ్ తెల్గాడే పై స్థానికులు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడిచేసి చంపేశారు. సాధువులు ఇద్దరూ గుజరాత్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలుగా భావించి స్థానికులు వారిని కొట్టిచంపినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల సమక్షంలోనే ఆ ఘాతుకం జరగడం విశేషం. తరువాత ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మూకదాడిలో పాల్గొన్న వందమందికిపైగా నిందితులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారికి బెయిల్ వచ్చింది. మరోవైపు మరోవైపు ఈ కేసులో సీఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 4500 పేజీల ఛార్జ్షీటులో 165 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో 11 మంది బాలలున్నారు.
Maharashtra government informs the Supreme Court that it has decided to hand over to CBI the probe into the Palghar lynching case wherein two Sadhus were lynched to death. pic.twitter.com/4CRXFBOwAa
— ANI (@ANI) April 28, 2023