
Supreme Court of India
పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిచింది. 2016 నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఐదుగురిలో నలుగురు న్యాయమూర్తులు నోట్ల రద్దును సమర్థించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఆధారంగా నోట్లరద్దు నిర్ణయాన్ని కొట్టివేయలేమన్నారు. నోట్ల రద్దు లక్ష్యాలను చేరుకోవడంలో కాస్త జాప్యం జరుగుతుండవచ్చు తప్ప పూర్తిగా ఆనిర్ణయాన్ని తప్పుపట్టలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.