సాయుధదళాల్లో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల డిల్లీ కోర్టులో వాదనలు వినిపించవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. పెండింగ్ కేసులు బదిలీ చేయకున్నా, పిటిషనర్లు ఒప్పుకోకున్నా డిల్లీ హైకోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. అగ్నిపథ్ ను నిరసిస్తూ తెలంగాణ , బిహార్ సహా పలు రాష్ట్రాల్లో విపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అగ్నిపథ్ పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన కేంద్ర రక్షణ శాఖ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది.