యూపీ రాంపూర్లోని మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు నిలిపిసేంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ కు చెందిన మహ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ ట్రస్టు వేసిన పిటిషన్పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఆగస్టులో ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)